parthasarathi: అనుభవజ్ఞుడని అధికారమిస్తే... అంపశయ్యపై పడుకోబెట్టారు: బాబుపై వైసీపీ నేత పార్థసారథి విమర్శలు

  • నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం చేశారు
  • బాబును సాగనంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు
  • ప్యాకేజీ కోసం చంద్రబాబు పాకులాడింది నిజం కాదా?

నాలుగేళ్లు ఏపీకి అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు... మళ్లీ అధికారమిస్తే అన్నీ సాధిస్తానని చెబుతుండటం విడ్డూరంగా ఉందని వైసీపీ నేత పార్థసారథి ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. అనుభవజ్ఞుడని అధికారమిస్తే, రాష్ట్రాన్ని అంపశయ్యపై పడుకోబెట్టారని విమర్శించారు. బాబును ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. విదేశాలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే చంద్రబాబు... జన్మభూమి గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 

టీడీపీ ఎంపీలు దొంగ దీక్షలు చేస్తున్నారని పార్థసారథి దుయ్యబట్టారు. హోదా కంటే ప్యాకేజీనే ముఖ్యమని చంద్రబాబు పాకులాడింది నిజం కాదా? అని ప్రశ్నించారు. బాబుకు కనీస విలువలు కూడా లేవని అన్నారు. చేసిన అన్యాయాలకు చంద్రబాబు ముక్కును నేలకు రాసి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News