TTD: 'తిరుమల శ్రీవారి నగలు మాయం' పై పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

  • దేవుని నగలు మాయం చేస్తున్నారు
  • గుడి లోపల తవ్వకాలు సాగిస్తున్నారు
  • భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న పిటిషనర్లు
  • మంగళవారం విచారణకు రానున్న పిటిషన్

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని నగలను మాయం చేస్తున్నారని, గుడి లోపల తవ్వకాలు జరుపుతున్నారని, పాలకమండలి నిర్ణయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వుంటున్నాయని ఆరోపిస్తూ దాఖలైన ఓ పిటిషన్ ను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించింది.

పురాతన ఆస్తులను, స్వామివారి నగలను కాపాడేందుకు వెంటనే తగిన ఆదేశాలు ఇవ్వాలని అనిల్ కుమార్, గోస్వామి అనే భక్తులు కోర్టును ఆశ్రయించగా, విచారించేందుకు న్యాయస్థానం నిర్ణయించింది. ఈ కేసు మంగళవారం నాడు విచారణకు రానుండగా, టీటీడీ పాలకమండలి, ఈఓ, ఏపీ ప్రభుత్వాలకు సమాధానం ఇవ్వాలని కోర్టు నోటీసులను పంపనున్నట్టు సమాచారం.

More Telugu News