saidharam tej: 'తేజ్ ఐ లవ్ యూ' ట్రైలర్ గురించి చరణ్

  • సాయిధరమ్ తేజ్ హీరోగా 'తేజ్ ఐ లవ్ యూ'
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • వచ్చేనెల 6వ తేదీన విడుదల

సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా రూపొందింది. కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ బయటికి వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై ఆసక్తి .. అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి చరణ్ స్పందించాడు. 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా ట్రైలర్ చూశాను .. నాకు బాగా నచ్చింది. విజువల్స్ .. మ్యూజిక్ రెండూ కూడా నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. కరుణాకరన్ నుంచి వస్తోన్న ఒక నమ్మకమైన సినిమాలా అనిపిస్తోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందిస్తోన్న దర్శక నిర్మాతలకు అభినందనలు అంటూ ఆయన తన మనసులోని మాటను చెప్పారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి గోపీసుందర్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.       

More Telugu News