kavitha: అందుకే కేసీఆర్ కు 'గుట్టమీద అమ్మవారు, గుట్టకింద కమ్మవారు' గుర్తుకొస్తున్నారు: రేవంత్ రెడ్డి విసుర్లు

  • నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నది పిల్లల కోసం తండ్రుల ఆరాటమే
  • కవిత కోసం కేసీఆర్, కొడుకుల కోసం డీఎస్ ఆరాటపడుతున్నారు
  • డీఎస్ కు జరుగుతున్న అన్యాయంపై దానం మాట్లాడాలి

సీనియర్ నేత డీఎస్ ను పార్టీ నుంచి తొలగించాలంటూ నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రాజకీయాలన్నీ పిల్లల కోసం తండ్రులు పడుతున్న ఆరాటమేనని అన్నారు. కుమార్తె కవిత కోసం కేసీఆర్ తాపత్రయ పడుతుంటే... కుమారుల కోసం డీఎస్ ఆరాటపడుతున్నారని చెప్పారు.

 కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగిపోతోందంటూ మొన్న దానం నాగేందర్ వ్యాఖ్యానించారని... ఇప్పుడు టీఆర్ఎస్ లో బీసీ నేత డీఎస్ కు జరుగుతున్న అవమానంపై ఆయన మాట్లాడాలని డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని... అందుకే కేసీఆర్ కు విజయవాడలో గుట్టమీద అమ్మవారు, గుట్టకింద కమ్మవారు గుర్తుకొస్తున్నారని అన్నారు. 

More Telugu News