ramaprabha: సావిత్రి చాలా సింపుల్ గా తన ఇల్లు రాసిచ్చేసింది!: రమాప్రభ

  • సావిత్రితో ఎంతో సాన్నిహిత్యం వుంది 
  • ఆమెకి మొండితనం ఎక్కువ 
  • అందువల్లనే చాలామంది దూరమయ్యారు

హాస్యనటిగా రమాప్రభ సుదీర్ఘ కాలం పాటు తన హవాను కొనసాగించారు. రొటీన్ కి భిన్నంగా బరువైన పాత్రల్లోను ఆమె మెప్పించారు. అలాంటి రమాప్రభ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "సావిత్రితో నాకు మంచి అనుబంధం వుంది. ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించాం. అందువలన మా మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది.

సావిత్రి సరదాగా బయటికి వెళ్లాలనుకుంటే, తనతో కూడా నన్ను తీసుకెళ్లేది. సావిత్రి ఆరోగ్యపరంగా .. ఆర్ధికంగా దెబ్బతిన్నప్పుడు ఎవరూ ఏమీ చేయలేకపోయారా అనే సందేహం కలగడం సహజం. కానీ సావిత్రి ఎవరిమాటా వినేది కాదు .. మహామొండి. ఆ మొండితనం వల్లనే ఆమె చాలా మందిని దూరం చేసుకుంది. ఒకసారి హిందీ నటుడు ప్రాణ్ .. పేద సినీ కళాకారులను ఆదుకోవడం కోసం 'గంధం మాల'ను వేలం వేశారు. ఆ మాలను భారీ మొత్తానికి పాడేసిన సావిత్రి .. ఆ డబ్బు నిమిత్తం 'మైలాపూర్' లోని ఇంటిని రాసిచ్చేసింది" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News