ramaprabha: రాజబాబు మరణం నన్ను బాగా కుంగదీసింది: రమాప్రభ

  • రాజబాబు నన్ను అక్కా అని పిలిచేవాడు
  • 'రేయ్' అంటూ ఆత్మీయంగా పలకరించేదానిని 
  • మళ్లీ అంతటి ప్రేమను చూపించింది ఎస్వీఆర్ గారే  

తెలుగు తెరపై రాజబాబు .. రమాప్రభ కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. అప్పట్లో పోస్టర్ పై ఈ జంట కనిపిస్తే చాలు .. జనం థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు. అలాంటి రాజబాబుతో కలిసి తాను చేసిన పాత్రలను గురించి రమాప్రభ ఇప్పటికీ తలచుకుంటున్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ .. రాజబాబును నేను తమ్ముడిగా భావించేదానిని. రేయ్ .. అని ఆప్యాయంగా పిలిచేదాన్ని.

నా పట్ల ఎంతో ప్రేమానురాగాలను చూపించేవాడు. తెరపైన .. బయట కూడా ఎంతో సందడి చేస్తూ కనిపించే రాజబాబు చనిపోవడం నా జీవితంలో ఎంతో విషాదాన్ని నింపిన సంఘటన. 'అక్కా' అంటూ పిలిచే రాజబాబు శాశ్వతంగా దూరం కావడం నా జీవితంలో ఎవరూ పూడ్చలేని వెలితి. రాజబాబు మరణం నన్ను బాగా కుంగదీసింది. నా పట్ల అంతటి ఆత్మీయానురాగాలను చూపించినది ఎస్వీ రంగారావుగారే. నన్ను ఓ కూతురులా ఆయన చూసుకునేవారు. నేను ఆయనను 'డాడీ' అని పిలిచేదానిని" అంటూ చెప్పుకొచ్చారు.  

More Telugu News