sridevi: ఐఫా అవార్డుల వేదికపై బోనీకపూర్ భావోద్వేగం

  • బ్యాంకాక్ లో ఐఫా అవార్డుల ప్రదానోత్సవం
  • ‘మామ్’లో శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డును అందుకున్న బోనీ
  • వేదికపై బోనీ భావోద్వేగం.. ఓదార్చిన అర్జున్ కపూర్

బ్యాంకాక్ లో ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ నిర్మాత బోనీకపూర్ తన భార్య, నటి శ్రీదేవి గురించి గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దివంగత నటి శ్రీదేవికి ‘మామ్’ చిత్రానికి  ఉత్తమ నటి అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును అందుకునేందుకు వేదికపైకి వెళ్లిన బోనీకపూర్ భావోద్వేగానికి గురయ్యారు. బోనీ వెంట ఉన్న కుమారుడు అర్జున్ కపూర్ తన తండ్రిని ఓదార్చారు.

 అనంతరం, మీడియాతో బోనీకపూర్ మాట్లాడుతూ, తన జీవితంలో ప్రతి క్షణం శ్రీదేవిని మిస్ అవుతున్నానని, ఆమె ఇప్పటికీ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోందని అన్నారు. శ్రీదేవిని ఆదరించినట్టే జాన్వీకపూర్ ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ అవార్డును ‘మామ్’ యూనిట్ సభ్యులకు అంకితం చేస్తున్నానని చెప్పారు. కాగా, ‘మామ్’ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మించారు. ఈ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడు అవార్డును నవాజుద్దీన్ సిద్దిఖీ అందుకున్నారు. ఈ అవార్డును శ్రీదేవికి అంకితమిస్తున్నట్టు ఆయన ఓ పోస్ట్ లో తెలిపారు.

More Telugu News