tarun bhaskar: ఈ నగరానికి ఏమైంది?' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముఖ్య అతిథులుగా కేటీఆర్ .. రానా .. చైతూ .. విజయ్ దేవరకొండ

  • తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 'ఈ నగరానికి ఏమైంది?'
  • షార్ట్ ఫిలిమ్స్ దర్శకుల కష్టాల కథ 
  • ఈ నెల 29వ తేదీన విడుదల

కథా కథనాల్లో .. పాత్రల ఆవిష్కరణలో కొత్తదనాన్ని చూపించే తరుణ్ భాస్కర్, కొత్తనటీనటులతో 'ఈ నగరానికి ఏమైంది?' అనే సినిమాను రూపొందించాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేశారు. హైదరాబాద్ .. 'లోటస్ పాండ్' సమీపంలోని 'రావి నారాయణ రెడ్డి ఆడిటోరియం'లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక మొదలుకానుంది.

సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబడిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి  కేటీఆర్ .. రానా .. నాగచైతన్య .. విజయ్ దేవకొండ ముఖ్య అతిథిలుగా రానున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తో తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకోవాలనుకున్న కొంతమంది యువకుల కథగా ఈ సినిమా రూపొందింది. 'పెళ్లిచూపులు'తో భారీ విజయాన్ని అందుకున్న తరుణ్ భాస్కర్ .. 'ఈ నగరానికి ఏమైంది?'తో మరో హిట్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి. 

More Telugu News