Cricket: ప్రపంచ క్రికెట్ కు అరుదైన సంపద రషీద్ ఖాన్: ప్రధాని ప్రశంసలు

  • ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మోదీ
  • ఆఫ్ఘనిస్థాన్ తో సంబంధాల గురించి ప్రస్తావన
  • ఆఫ్ఘాన్ తో తొలి టెస్టు మ్యాచ్, ఐపీఎల్-11పై మాట్లాడిన ప్రధాని 

ప్రపంచ క్రికెట్ కు అరుదైన సంపద క్రికెటర్ రషీద్ ఖాన్ అంటూ ఆఫ్ఘనిస్థాన్ క్రీడాకారుడిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో భాగంగా మనకు ఆఫ్ఘనిస్థాన్ తో సంబంధాల గురించి మోదీ మాట్లాడుతూ ఈ ప్రశంసలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు భారత్ తో ఇటీవల ఆడిన తొలి టెస్టు మ్యాచ్ విషయాన్ని, ఐపీఎల్ -11 సీజన్ లో రషీద్ రాణించిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ అత్యుత్తమమైందని, ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశ ప్రజలు ఎంతో బాగా జరుపుకున్నారని అన్నారు. రాజస్థాన్ లో లక్ష మంది ఏకకాలంలో యోగా చేసి రికార్డు సృష్టించారని, దేశ సరిహద్దుల్లో ఉండే జవాన్లు సైతం యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుకున్న విషయాన్ని మోదీ ప్రస్తావించారు. అహ్మాదాబాద్ లో 740 మంది దివ్యాంగులు కలిసి చేసిన యోగ ప్రపంచ రికార్డు సృష్టించిందని అన్నారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ‘మన్ కీ బాత్’ లో మోదీ పేర్కొన్నారు.

More Telugu News