kalyan dev: 'విజేత' ఆడియో వేడుకకి వేదిక ఖరారు

  • కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత'
  • నిర్మాతగా సాయి కొర్రపాటి
  • దర్శకుడిగా రాకేశ్ శశి    

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత ' సినిమా రూపొందింది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

రేపు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ - జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉండగా, ఆయనతో పాటు చరణ్ .. అల్లు అర్జున్ కూడా రానున్నట్టు చెబుతున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన 'కో .. కొక్కరొకో .. ' అనే పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట .. ఈ సినిమాపై అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కల్యాణ్ దేవ్ జోడీగా మాళవిక నాయర్ నటించిన సంగతి తెలిసిందే.

More Telugu News