Jagan: మొక్కను నాటిన జగన్.. వీడియో చూడండి

  • మరో మైలురాయిన దాటిన జగన్ పాదయాత్ర
  • 2400 కిలోమీటర్లు పూర్తి
  • మొక్క నాటి, జెండా ఎగురవేసిన జగన్

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 2400 కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. వడదెబ్బను సైతం లెక్కచేయకుండా కొనసాగిన ఆయన పాదయాత్ర... ఈ క్రమంలో మరో మైలురాయిని చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం లక్కవరం వద్ద ఈ మైలురాయిని అందుకుంది. ఈ సందర్భంగా జగన్ ఆ ప్రాంతంలో ఓ మొక్కను నాటారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. మొక్కను నాటిన వీడియోను మీరూ చూడండి.

More Telugu News