Chandrababu: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

  • కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి
  • ఏపీ రెవెన్యూ లోటును భర్తీ చేయాలి
  • విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటినీ పరిష్కరించాలి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఓ లేఖ రాశారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూలోటును భర్తీ చేయాలని చంద్రబాబు కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటినీ పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. కాగా, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.    

More Telugu News