purandeswari: బీజేపీలో పురందేశ్వరి మాత్రమే ఉంది.. నేను లేను: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

  • 2014లోనే రాజకీయాలను వదిలేశా
  • రాజకీయాలపై ఆసక్తి లేదు
  • తెలంగాణ పోరాటంపై పుస్తకం రాశా

తన భార్య పురందేశ్వరి మాత్రమే బీజేపీలో ఉన్నారని... తాను ఆ పార్టీలో లేనని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. 2014లోనే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని... తనకు ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. ఈ కాలంలో తెలంగాణ పోరాటంపై ఓ పుస్తకం రాశానని తెలిపారు. గతంలో రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఎంతో మందిని కలవలేక పోయానని... ఇప్పుడు అందరినీ కలుస్తున్నానని చెప్పారు. ఇప్పుడు తనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడుపుతున్నానని, చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు.

More Telugu News