dokka: యావత్తు దేశం చంద్రబాబు ప్రసంగం గురించే మాట్లాడుకుంటోంది: డొక్కా మాణిక్యవరప్రసాద్

  • నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగంపై ప్రశంస
  • ఏపీలో సమస్యల గురించి దేశమంతటా చర్చించుకుంటున్నారు
  • చంద్రబాబు స్పీచ్ ‘టాక్ ఆఫ్ ది నేషన్’

ఢిల్లీలో నిన్నజరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం గురించే యావత్తు దేశం చర్చించుకుంటోందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంతో రాష్ట్రంలో సమస్యల గురించి దేశమంతటా చర్చించుకుంటున్నారని, చంద్రబాబు స్పీచ్ ‘టాక్ ఆఫ్ ది నేషన్’ అని ప్రశంసించారు.

ఈ సమావేశం ద్వారా మోదీ ద్వంద్వ వైఖరి మరోసారి స్పష్టమైందని విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ-వైసీపీ కుమ్మక్కయ్యాయని.. ఈ రెండు పార్టీలను ప్రజలు త్వరలో తిప్పికొడతారని అన్నారు. కృష్ణుడి లాంటి చంద్రబాబు దగ్గర వీరి డ్రామాలు సాగవని డొక్కా హెచ్చరించారు.

More Telugu News