Anushka Sharma: ఈ సారి ముఖానికి కేక్ బదులు ఆవు పేడ పూసుకో: అనుష్కపై నెటిజన్ల ఫైర్

  • రోడ్డుపై చెత్త వేసిన అర్హాన్ సింగ్ ను తిట్టిన అనుష్క
  • వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కోహ్లీ
  • అనుష్క, కోహ్లీలపై సెటైర్లు వేస్తున్న నెటిజన్లు

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ఆమె భర్త విరాట్ కోహ్లీలపై నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, ముంబైలో కారులో వెళ్తున్న అర్హాన్ సింగ్ అనే వ్యక్తి రోడ్డుపై ఓ ప్లాస్టిక్ కవర్ ను పడేశాడు. దీంతో, అతనిపై అనుష్క మండిపడింది. రోడ్డు మీద చెత్త ఎందుకు వేస్తున్నావంటూ కేకలు వేసింది. ఈ తతంగాన్నంతా పక్కనే ఉన్న కోహ్లీ వీడియో తీసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.

దీనిపై అర్హాన్ కూడా క్షమాపణలు చెప్పాడు. పొరపాటున చెత్తను రోడ్డుపై పడేశానని చెప్పాడు. అయితే, రోడ్డుపై తాను పడేసిన చెత్తకంటే... అనుష్క నోటి నుంచి వచ్చిన చెత్తే ఎక్కువని మండిపడ్డాడు. ఈ ఘటనను సోషల్ మీడియాలో షేర్ చేసిన నీ భర్త కోహ్లీ బుర్ర కూడా చెత్తే అంటూ ఫైర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అనుష్క, కోహ్లీలపై పలువురు నెటిజెన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. కొన్ని కామెంట్స్ ఇవే...

బర్త్ డే వస్తే కేక్ మొత్తం ముఖానికి పూసుకుని, దాన్ని వేస్ట్ చేస్తున్నారు. తిండి లేక ఎంతో మంది అలమటిస్తున్నారు. ఈ సారి కేక్ కు బదులు ఆవు పేడ పూసుకో.

చెత్త పడేశాడని క్లాస్ పీకడంలో తప్పు లేదు. కానీ, సదరు వ్యక్తి విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దారుణం.

రోడ్డుపై చెత్త పడేసేవారినే కాదు... క్రికెట్ మైదానంలో నోటికొచ్చినట్టు తిట్టే నీ భర్తను కూడా అదుపులో పెట్టుకో.

ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత.. అలా తిట్టడం ఫ్యాషన్ అని చాలా మంది అనుకుంటున్నారు. మీ మర్యాద, మీ విలువలు ఏమైపోయాయి?

రోడ్డుపై చెత్త వేశారన్న బాధ కన్నా... త్వరగా దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలన్న తపనే అనుష్కలో ఎక్కువగా ఉంది. అనుష్క తిడుతున్నప్పుడు వీడియో తీయాలన్న ఆలోచన కోహ్లీకి రావడానికి కారణం ఇదే.

రోడ్లపై చెత్త వేసేవారిని ఇప్పుడే కొత్తగా చూస్తున్నారా? ఒకవేళ అతనికి బుద్ధి చెప్పాలనుకుంటే స్నేహపూర్వకంగా, మర్యాదగా చెప్పొచ్చు. బాస్ లా ప్రవర్తించడానికి మీరు ఎవరు?

నీ భార్య హీరోయిజాన్ని సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏముంది కోహ్లీ?

  • Loading...

More Telugu News