allu shirish: అల్లు శిరీశ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

  • అల్లు శిరీశ్ హీరోగా 'ఏబీసీడీ'
  • మలయాళ మూవీకి రీమేక్ 
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్

సరైన కథ కోసం వెయిట్ చేస్తూ కొంత గ్యాప్ తీసుకున్న అల్లు శిరీశ్, తాజాగా ఒక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన 'ఏబీసీడీ' సినిమాకి ఇది రీమేక్. ఆ సినిమా అక్కడ ఘన విజయాన్ని సాధించడంతో, తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మధుర శ్రీధర్ నిర్మాణంలో .. సంజీవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో కొంతసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

అల్లు శిరీశ్ .. కథానాయిక రుక్షార్ పై నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా .. నిర్మాత సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సినిమా టీమ్ కి ఈ నిర్మాతలిద్దరూ శుభాకాంక్షలు అందజేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.  

More Telugu News