akhil: విదేశాలకి బయలుదేరుతోన్న అఖిల్

  • అఖిల్ హీరోగా 'మిస్టర్ మజ్ను'
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • దసరాకి రిలీజ్ చేసే ఆలోచన  

అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమా  ఫస్టు షెడ్యూల్ ను యూకేలో ప్లాన్ చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి దాదాపు 2 నెలల పాటు అక్కడ వివిధ ప్రదేశాల్లో ప్రధాన పాత్రల కాంబినేషన్లో చిత్రీకరణను జరపనున్నారు. దాంతో ఈ సినిమా 70 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్నట్టు అవుతుందని అంటున్నారు.

బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అఖిల్ జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'తొలిప్రేమ' సూపర్ హిట్ కావడం వలన, ఇది కూడా ప్రేమకథా చిత్రమే కావడం వలన ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.  

  • Loading...

More Telugu News