suhasini: రాజశేఖర రెడ్డి బయోపిక్ లో సుహాసిని?

  • షూటింగు దశలో 'యాత్ర'
  • ప్రధాన పాత్రలో మమ్ముట్టి 
  • సూరీడు పాత్రలో పోసాని

దర్శకుడు మహి వి.రాఘవ ... వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ను రూపొందిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రజలను ఎంతో ప్రభావితం చేశారు గనుక, ఈ సినిమాకి 'యాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఆయన పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది.

ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య పాత్ర కోసం 'ఆశ్రిత వేముగంటి'ని ఎంపిక చేసుకున్నారు. 'బాహుబలి 2' సినిమాలో 'కన్నా నిదురించరా ..' అనే పాటలో అనుష్కతో పాటు ఆశ్రిత వేముగంటి మెరిసింది. ఈ పాటతో ఆమె అందరినీ తనవైపుకు తిప్పుకుంది. ఇక ఈ సినిమాలో సబితా ఇంద్రారెడ్డి పాత్ర కూడా కీలకంగా కనిపించనుంది. ఈ పాత్ర కోసం సుహాసినిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే సుహాసిని అంగీకరించిందని అంటున్నారు. వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణమురళిని తీసుకోవడం కూడా ఆసక్తిని రేకెత్తించే అంశమేనని చెప్పాలి.       

  • Loading...

More Telugu News