karthi: రైతు సమస్యల నేపథ్యంలో 'చినబాబు' .. త్వరలో ప్రేక్షకుల ముందుకు

  • పాండిరాజ్ దర్శకత్వంలో కార్తీ 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • వచ్చేనెలలో భారీ స్థాయి రిలీజ్

మొదటి నుంచి కూడా కంటెంట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ కార్తీ వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో వచ్చిన 'ఖాకి' సినిమా ఆయనకి భారీ విజయాన్ని అందించింది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'చినబాబు' రెడీ అవుతోంది. తమిళంలో కార్తీ హీరోగా దర్శకుడు పాండిరాజ్ 'కడైకుట్టి సింగం' సినిమాను రూపొందించాడు. తెలుగులో ఈ సినిమాకి 'చినబాబు' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను వచ్చేనెల 13వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సాయేషా సైగల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో కార్తీ .. రైతుగా కనిపించనున్నాడు. గ్రామీణ నేపథ్యం.. రైతు సమస్యలే ప్రధానంగా ఈ కథ కొనసాగుతుంది. ఊరి పెద్ద చిన్నకొడుకుగా కార్తీ పాత్ర ఆకట్టుకోనుంది. భారీ బడ్జెట్ తో సూర్య నిర్మించిన ఈ సినిమాను, నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.    

More Telugu News