Afghanisthan: చారిత్రక టెస్టు ప్రారంభం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రహానే సేన!

  • బెంగళూరు వేదికగా ఏకైక టెస్టు
  • భారత్‌తో టెస్టు క్రికెట్‌ను మొదలుపెడుతున్న ఆఫ్ఘాన్
  • అసలైన టెస్టు మజాను అందించనున్న మ్యాచ్

భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మరికొద్ది సేపట్లో చారిత్రక ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మెడ నొప్పితో బాధపడుతున్న టీమిండియా సారథి కోహ్లీ స్థానంలో అజింక్యా రహానే జట్టును నడిపించనున్నాడు.

 టాస్ అనంతరం రహానే మాట్లాడుతూ, వికెట్ బ్యాటింగుకి అనుకూలంగా ఉండడం వల్లే బ్యాటింగ్ ఎంచుకున్నట్టు చెప్పాడు. గడ్డి మీద కొంచెం పచ్చిక ఉన్నప్పటికీ తాము తొలుత బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. ఆటగాళ్లు అందరూ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, చారిత్రక టెస్టును కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

ఆఫ్గనిస్థాన్ కెప్టెన్ అస్ఘర్ స్టానిక్ జై మాట్లాడుతూ తొలి టెస్టు ఆడుతున్నట్టు గర్వంగా ఉందన్నారు. తమకు తొలుత బౌలింగ్ చేసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందన్నాడు. ఆటగాళ్లందరూ విజయం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు.

More Telugu News