Geetha Madhuri: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • గీతామాధురికే ఎక్కువ పారితోషికం?
  • 100 కోట్ల బడ్జెట్టుతో బన్నీ సినిమా 
  • పుస్తక రూపంలో ఏఆర్ రెహ్మాన్ విజయగాథ  
  • నాదెండ్ల పాత్రలో బాలీవుడ్ నటుడు

*  'బిగ్ బాస్ 2' రియాల్టీ షోలో పాల్గొంటున్న గాయని గీతామాధురి 20 లక్షల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ షోలో పాల్గొంటున్న వారిలో అందరిలోకీ ఆమెకే ఎక్కువ పారితోషికం ముడుతోందట.  
*  అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని విక్రం కుమార్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సుమారు 100  కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ జీవితంపై ఓ పుస్తకం వెలువడనుంది. చెన్నయ్ కి చెందిన కృష్ణ త్రిలోక్ అనే ఇరవై నాలుగేళ్ల కుర్రాడు 'నోట్స్ ఆఫ్ ఏ డ్రీమ్:ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహ్మాన్' పేరిట ఈ పుస్తకాన్ని రాస్తున్నాడు. ఆగస్టులో దీనిని రిలీజ్ చేస్తారు.
*  క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ టైటిల్ పాత్రలో రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో నాదెండ్ల భాస్కరరావు పాత్రను బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ పోషించనున్నట్టు సమాచారం. అలాగే, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి కనిపిస్తాడు. 

More Telugu News