kachiguda - karimnagar: నిజామాబాద్ మీదుగా కాచిగూడ-కరీంనగర్ కొత్త రైలు

  • రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభిస్తారు  
  • నిజామాబాద్, జగిత్యాల మీదుగా కరీంనగర్ చేరుకోనున్న రైలు
  • తిరిగి ఇదే మార్గంలో కాచిగూడకు వస్తుంది

కాచిగూడ నుంచి నిజామాబాద్ మీదుగా కరీంనగర్ కు కొత్త రైలు ప్రారంభం కానుంది. ఈ నెల 15న రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాచిగూడ నుంచి నిజామాబాద్, మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల మీదుగా కరీంనగర్ కు ప్రతిరోజు ఈ రైలు నడవనుంది. ఈ రైలు తిరిగి ఇదే మార్గంలో కాచిగూడకు చేరుకుంటుందని రైల్వే శాఖాధికారులు చెప్పారు.

కాగా, నిజామాబాద్ ఎంపీ కవిత గతంలో రైల్వే శాఖ మంత్రితో పాటు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు ఈ మేరకు ఓ లేఖ రాశారు. ఈ లేఖ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు స్పందించడంతో కాచిగూడ-కరీంనగర్ మార్గంలో కొత్త రైలు రానుంది.

More Telugu News