evm: ఈవీఎంల దుర్వినియోగానికి అవకాశాలు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి: చంద్రబాబు

  • యనమల చేసిన వ్యాఖ్యలు నిజమే
  • ఏ ఎలక్ట్రానిక్‌ వస్తువునైనా దుర్వినియోగం చేయొచ్చు
  • గ్రామాల్లో పర్యటించడాన్ని కొందరు నేతలు మరచిపోతున్నారు
  • టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు

ఈవీఎంల పనితీరుపై అప్రమత్తంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్‌ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈరోజు అమరావతిలోని ప్రజాదర్బార్‌ హాలులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు, తమ పార్టీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ... యనమల చేసిన వ్యాఖ్యలు నిజమేనని అన్నారు. ఏ ఎలక్ట్రానిక్‌ వస్తువునైనా దుర్వినియోగం చేయడం చాలా సులభమని చెప్పారు. కాగా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ నేతలు సిద్ధంగా ఉండాలని అన్నారు. గ్రామాల్లో పర్యటించడం కొందరు నేతలు మరచిపోతున్నారని అన్నారు.       

  • Loading...

More Telugu News