ఆర్టీసీ కార్మికులతో ముగిసిన తెలంగాణ మంత్రుల చర్చలు
- ప్రగతి భవన్కు బయలుదేరిన మంత్రులు
- కాసేపట్లో సీఎం కేసీఆర్తో భేటీ
- ఆర్టీసీ సంఘాల తుది ప్రతిపాదనలు సీఎం వద్దకు..
కాగా, రేపటి నుంచి సమ్మెకు దిగుతామని ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్, మహేందర్రెడ్డి, జగదీశ్రెడ్డి ఇప్పటికే ఈ విషయంపై పలుసార్లు చర్చలు జరిపినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు.