tarun basker: తరుణ్‌ భాస్కర్‌ 'ఈ న‌గ‌రానికి ఏమైంది' ట్రైలర్‌ విడుదల

  • సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో సినిమా
  • హైదరాబాద్‌ యాసలో డైలాగులు
  • నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథ..

'పెళ్లిచూపులు' సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్‌ దర్శకత్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న 'ఈ న‌గ‌రానికి ఏమైంది' చిత్రం ట్రైలర్‌ ఈరోజు విడుదలైంది. 'నీ గ్యాంగ్‌తో థియేట‌ర్‌కు రా చూసుకుందాం' అనే ఆసక్తికర ఉప శీర్షికతో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ట్రైలర్‌లో హైదరాబాద్ యాసతో కూడిన డైలాగ్‌లు అలరిస్తున్నాయి. నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథగా ఈ సినిమా ఉండనుంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు వివేక్‌ సాగర్‌ సంగీతమందిస్తున్నారు.

'మనం కూడా ఈ సాయంత్రం మధ్యపానంలో మునిగి తేలాల్సిందే' అంటూ ఈ ట్రైలర్‌లో ఓ డైలాగ్‌ వదిలారు. అలాగే, 'ఈరోజు ఆఫీస్‌కి ఎందుకుపోలే' అని ఒకరు అడగగా, 'నాగుల పంచమి ఇయ్యాల' అని ఓ నటుడు సమాధానం ఇస్తున్నాడు.

ఈ సినిమా ట్రైలర్‌పై సినీనటుడు నాని స్పందిస్తూ... ఈ మధ్యకాలంలో తాను చూసిన ట్రైలర్‌లలో చాలా సహజంగా, ఫన్‌గా ఉన్న ట్రైలర్‌ ఇదేనని అన్నాడు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌ చేశాడు.                                                                                                        

More Telugu News