raj tarun: పారితోషికం తగ్గించడానికి సిద్ధమైన రాజ్ తరుణ్?

  • తొలినాళ్లలో వరుస హిట్లు 
  • ఆ తరువాత పరాజయాలు 
  • స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ  

తెలుగు తెరపై రాజ్ తరుణ్ మొదటి నుంచి కూడా మంచి దూకుడు చూపిస్తూ వచ్చాడు. తొలినాళ్లలో వరుస సక్సెస్ లు వచ్చిపడటంతో, చకచకా పారితోషికాన్ని పెంచేసుకుంటూ వెళ్లాడు. ఆ తరువాత ఆయన చేసిన 'అంధగాడు' .. 'రంగులరాట్నం' .. 'రాజుగాడు' సినిమాలు ప్రేక్షకులను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సక్సెస్ లు వుంటే పారితోషికం పెంచేసినా ముందుకు వచ్చే నిర్మాతలు .. సక్సెస్ లేకపోతే పారితోషికాన్ని తగ్గిస్తేనేగానీ ముందుకురారు.

రాజ్ తరుణ్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన రాజ్ తరుణ్ తన పారితోషికాన్ని భారీగానే తగ్గించుకునేందుకు సిద్ధమయ్యాడని అంటున్నారు. మళ్లీ ఒక హిట్ పడితే పారితోషకం పెంచేయవచ్చనేది రాజ్ తరుణ్ ఆలోచన కావొచ్చు .. అప్పటి వరకూ తగ్గించిన పారితోషికంతోనే కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ విషయంలోను మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని చెబుతున్నారు.   

  • Loading...

More Telugu News