nandamuri: వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏపీలో ఒక్క లోక్ సభ సీటు కూడా గెలవదు: నందమూరి బాలకృష్ణ

  • గత ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బీజేపీ రెండు లోక్ సభ సీట్లు గెలిచింది
  • వచ్చే ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా రాదు
  • బీజేపీ నాయకులు నాలుగు గోడల మధ్య మాటలు చెప్పడం కాదు
  • దమ్ముంటే, రోడ్డుపైకి వచ్చి మాట్లాడాలి

గత ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బీజేపీ రెండు లోక్ సభ సీట్లు గెలిచిందని, వచ్చే ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా ఆ పార్టీ గెలవదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా సూగూరు వద్ద నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, కొంత మంది బీజేపీ నేతలు తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు నాలుగు గోడల మధ్య కూర్చుని మాటలు చెప్పడం కాదని, దమ్ముంటే, రోడ్డుపైకి వచ్చి మాట్లాడాలని, ప్రజలు తమ సత్తా చూపుతారని అన్నారు. 

More Telugu News