Jagan: జగన్ తో రమణదీక్షితుల భేటీపై విమర్శలు చేస్తారా?: ఐవైఆర్ కృష్ణారావు

  • జగన్ ని రమణదీక్షితులు బహిరంగంగానే కలిశారు
  • రాజకీయం చేయడం సబబు కాదు
  • ఇలాంటి సంకుచిత భావాలకు స్వస్తి పలకాలి

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు నిన్న భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీపై కొందరు విమర్శలు చేస్తుండటంపై ఏపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.

జగన్ ని రమణదీక్షితులు కలవడంపై రాజకీయం చేయడం సరికాదని , ఇలాంటి సంకుచిత భావాలకు స్వస్తి పలకాలని సూచించారు. రమణదీక్షితులు బహిరంగంగానే జగన్ ను కలిశారని, ఎవరైనా ఎవర్నైనా కలిసే స్వేచ్ఛ ఉంటుందని ఐవైఆర్ అన్నారు.

More Telugu News