Pranab Mukherjee: భరతమాత గొప్ప కుమారుడికి నివాళులర్పించేందుకు వచ్చా: ప్రణబ్ ముఖర్జీ

  • నాగపూర్ చేరుకున్న ప్రణబ్
  • హెడ్గేవార్ జన్మస్థలాన్ని, ఇంటిని సందర్శించిన మాజీ రాష్ట్రపతి
  • సందర్శకుల పుస్తకంలో సంతకం చేసిన ప్రణబ్ 

నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం మాజీ రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీ ఇక్కడికి చేరుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ జన్మస్థలాన్ని ఆయన సందర్శించారు. హెడ్గేవార్ నివసించిన ఇంటిని పరిశీలించారు.‘భరతమాత గొప్ప కుమారుడికి నివాళులర్పించేందుకు వచ్చాను’ అంటూ సందర్శకుల పుస్తకంలో ప్రణబ్ రాశారు. కొద్ది సేపట్లో ఆర్ఎస్ఎస్ సంఘ్ శిక్ష వర్గ్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

More Telugu News