savithri: సావిత్రి తన భర్తను అలా పిలిచేవారట!

  • సావిత్రికి ఎంతోమంది అభిమానులు 
  • ఆమె గురించిన విషయాల పట్ల అందరిలో ఆసక్తి
  • సావిత్రి భర్త జెమినీ గణేశన్ అయ్యర్  

సావిత్రి జీవితచరిత్ర 'మహానటి' సినిమాగా రావడంతో, ఆమె గురించిన మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. సావిత్రి .. జెమినీ గణేశన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే జెమినీ గణేశన్ కి రెండు పెళ్లిళ్లు అయ్యాయి .. పిల్లలు వున్నారు. అయినా ఆయన పట్ల గల ప్రేమతోనే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కొంతకాలం పాటు చాలా అన్యోన్యంగానే వున్నారు.

ఈ నేపథ్యంలోనే సావిత్రి జెమినీ గణేశన్ ను ఏమని పిలిచేవారనే సందేహం అభిమానుల్లో తలెత్తుతూ ఉంటుంది. తన భర్తను గురించి సావిత్రి ఎవరికైనా చెప్పవలసి వస్తే 'అయ్యర్' అంటూ చెప్పేవారట. ఇక జెమినీ గణేశన్ ను ఆమె 'ఎన్నాంగో' అంటూ పిలిచేవారట. 'ఎన్నాంగో' అంటే .. 'ఏవండీ' అని అర్థం. సావిత్రి మంచితనం .. మాట తీరు మనకి తెలుసు కనుక, ఆమె తన భర్తను ఎంత అందంగా .. ఆత్మీయంగా పిలిచేవారో ఊహించుకోవచ్చు.      

More Telugu News