Mehrin: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నితిన్ తో జతకట్టనున్న మెహ్రీన్ 
  • జ్యోతిక ప్రధాన పాత్రలో సినిమా 
  • శర్వానంద్, సాయిపల్లవి జంటగా 'విరాటపర్వం 1992'

*  యువ కథానాయిక మెహ్రీన్ ఈసారి నితిన్ తో జతకట్టనుంది. 'చలో' ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందే చిత్రంలో మెహ్రీన్ నాయికగా నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు నుంచి జరుగుతుంది.
*  ప్రముఖ నటి జ్యోతిక నాయికగా ఓ చిత్రం రూపొందుతోంది. హిందీలో విద్యాబాలన్ నటించిన 'తుమ్హారీ సులు' చిత్రం తమిళ రీమేక్ లో జ్యోతిక నటిస్తోంది. రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నయ్ లో జరుగుతోంది. దీనిని తెలుగులోకి కూడా అనువదిస్తారు.
*  శర్వానంద్, సాయిపల్లవి జంటగా ఓ చిత్రం రూపొందనుంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించే ఈ చిత్రానికి 'విరాటపర్వం 1992' అనే టైటిల్ని నిర్ణయించారు. 1990ల నాటి వాతావరణంలో ఇది తెరకెక్కుతుంది. 

More Telugu News