press note: టీడీపీ నాలుగేళ్ల పాలనపై ఛార్జిషీటు విడుదల చేస్తాం: రఘువీరారెడ్డి

  • జూన్‌ 8తో టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతాయి
  • అదే రోజు ఉదయం తాడేపల్లి గూడెంలో సభ
  • తొలిరోజు సీఎం 5 సంతకాలు చేశారు          

టీడీపీ నాలుగేళ్ల పాలనను వివరిస్తూ తాము ఛార్జిషీట్‌ విడుదల చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఈ మేరకు విజయవాడలోని తమ పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్‌ 8, 2018తో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతాయని, అదే రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లి గూడెం బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే సభలో ఈ ఛార్జిషీటు విడుదల చేస్తామని పేర్కొన్నారు. టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అంశాలు, తొలిరోజు సీఎం చేసిన 5 సంతకాలు, కేంద్ర సర్కారు నుంచి రాబట్టాల్సిన నిధులు ఏ మేరకు వచ్చాయని విశ్లేషిస్తే నిరాశే మిగులుతుందని అన్నారు.                  

More Telugu News