Mumbai: జేబులోనే పేలిపోయిన సెల్ ఫోన్... వీడియో ఇదిగో!

  • ముంబైలోని రెస్టారెంట్ లో ఘటన
  • పరుగులు తీసిన కస్టమర్లు
  • సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఘటన

ఇదో షాకింగ్ ఇన్సిడెంట్. ఓ రెస్టారెంట్ లో కూర్చుని తింటున్న వ్యక్తి జేబులోని స్మార్ట్ ఫోన్ పేలిపోగా, మిగతా కస్టమర్లంతా తీవ్ర భయాందోళనలతో పరుగులు పెట్టారు. ముంబైలోని బంధూప్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

ఈ నెల 4వ తేదీన ఘటన జరిగినట్టు తెలుస్తుండగా, షర్ట్ జేబులో పెట్టుకున్న ఫోన్ పేలి, రెస్టారెంట్ అంతా పొగలు వ్యాపించాయి. అతనికి స్వల్పగాయాలు కాగా, ఆసుపత్రిలో చేర్పించారని తెలుస్తోంది. గడచిన మార్చిలో ఒడిశాలోని ఓ టీనేజర్ తన బంధువుతో ఫోన్ మాట్లాడుతూ చార్జింగ్ పెట్టగా, అది పేలిపోయిన సంగతి తెలిసిందే. ముంబై రెస్టారెంట్ లో జరిగిన ఘటన వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News