Pawan Kalyan: విశాఖ ఏజెన్సీలో గిరిజనులతో మమేకమైన పవన్ కల్యాణ్.. ఫొటోలు చూడండి

  • అరకు, పాడేరు ప్రాంతాల్లో పవన్ పర్యటన
  • తమ బాధలను చెప్పుకున్న గిరిజనులు
  • నీటిని పరీక్షలు చేయించాలంటూ పార్టీ నేతలకు ఆదేశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ ఏజెన్సీలోని అరకు, పాడేరు చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలను సందర్శించారు. డుండ్రిగూడ మండలం పనసపొట్టు గ్రామంలోని గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ కష్టనష్టాలను పవన్ తో గిరిజనులు చెప్పుకున్నారు. కలుషిత నీరు వల్ల తాము జబ్బులపాలు అవుతున్నామని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వెంటనే స్పందించిన పవన్... నీటి నమూనాలను తీసి, పరీక్షలు చేయించాలని పార్టీ నేతలకు సూచించారు.

More Telugu News