divyavani: 'మహానటి'లో చేయడానికి కారణమిదే: సీనియర్ హీరోయిన్ దివ్యవాణి

  • స్వప్నదత్ గారు ఫోన్ చేశారు 
  • సావిత్రికి తల్లిపాత్ర చేయమన్నారు 
  • మంచిపాత్ర కావడంతో ఓకే అన్నాను

తెలుగులో 'పెళ్లి పుస్తకం' సినిమాతో పాప్యులర్ అయిన దివ్యవాణి, ఆ తరువాత వరుసగా చాలా సినిమాలు చేశారు. కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చిన ఆమె, 'మహానటి' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె సావిత్రికి తల్లిపాత్రలో కనిపించారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ..  ఓ రోజున నాకు స్వప్నదత్ గారు ఫోన్ చేశారు .. సావిత్రిగారి తల్లి పాత్రను చేయవలసి ఉంటుందని చెప్పి రమ్మన్నారు.

 ఆ మర్నాడు సాయంత్రం నేను ఆమెను కలవడం .. ఓకే చెప్పడం జరిగిపోయాయి. రీ ఎంట్రీలో నిడివి తక్కువగా గల వేషం వేయడం కరెక్టేనా అని నేను ఆలోచించలేదు .. ముఖ్యమైన పాత్ర .. పెద్ద బ్యానర్ .. వీటిని మాత్రమే నేను దృష్టిలో పెట్టుకుని అంగీకరించాను. పాత్రలను బట్టి చూసుకుంటే కీర్తి సురేశ్ .. రాజేంద్రప్రసాద్ తరువాత నా పాత్ర ప్రాధాన్యత కలిగినదిగా కనిపిస్తుంది. చాలా రోజుల తరువాత రాజేంద్రప్రసాద్ గారితో కలిసి నటించడం సంతోషాన్ని కలిగించింది" అని చెప్పుకొచ్చారు.     

More Telugu News