savitri: సావిత్రి క్రేజ్ అలాంటిది .. పోటీపడిన బి.సరోజాదేవి!

  • సావిత్రితో జమున ఎంతో ఆత్మీయంగా ఉండేవారు 
  • బి.సరోజాదేవిలో మాత్రం పోటీ తత్వం ఉండేది 
  • అందుకే రెండు కార్లలో షూటింగుకు వచ్చేవారు      

తెలుగు తెరకి సంబంధించినంత వరకూ కథానాయికల పేర్లను వారి క్రేజ్ ను బట్టి చెప్పాలంటే సావిత్రి పేరుతోనే మొదలుపెట్టవలసి వస్తుంది. తెలుగులో మొదటిసారిగా అత్యధిక పారితోషికం తీసుకున్న కథానాయిక ఆమె. సాధారణంగా సావిత్రి సెట్లోకి వస్తే అందరితోనూ ఆమె ఎంతో కలుపుగోలుగా వుంటారు. ముఖ్యంగా సావిత్రి ..  జమున అక్కా .. చెల్లి అని పిలుచుకుంటూ ఆత్మీయంగా మసలుకునేవారు.అయితే బి.సరోజాదేవి మాత్రం సావిత్రితో పోటీపడుతూ ఉండేవారట. సావిత్రి రెండు కార్లలో షూటింగుకి వస్తే .. బి.సరోజాదేవి కూడా రెండు కార్లలో షూటింగుకి వచ్చేవారు. సావిత్రి తన సన్నిహితులను ఆ కార్లలో తీసుకొస్తే .. సరోజాదేవి కూడా తన సన్నిహితులను వెంటబెట్టుకుని కార్లలో వచ్చేవారు. గతంలో సావిత్రికి రెండు కార్లను పంపిన విషయాన్ని గుర్తుచేస్తూ తనకి కూడా రెండు కార్లు ఇవ్వాల్సిందేనని సరోజాదేవి 'దాగుడు మూతలు' సినిమా షూటింగు సమయంలో పట్టుబట్టారట. సావిత్రితో ఎవరికీ పోలిక లేదనీ .. సావిత్రి తెలుగు నేర్పుతుందనీ .. మీరు తెలుగు నేర్చుకుంటున్నారని సరోజాదేవితో ఆ ప్రొడక్షన్ వాళ్లు అన్నారట. అయితే సావిత్రి ఈ విషయాలను గురించి పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.    

More Telugu News