Chandrababu: కేంద్రం సిద్ధంగా ఉన్నా.. చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు: జీవీఎల్ విమర్శ

  • ధొలేరాకు 98వేల కోట్లు ఎప్పుడు కేటాయించామో చెప్పాలి
  • ధొలేరా నగరానికి గత ప్రభుత్వ హయాంలోనే అంకురార్పణ జరిగింది
  • కృష్ణపట్నంను పూర్తి చేయడానికి చంద్రబాబు చొరవ చూపడం లేదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై వాస్తవాలను చంద్రబాబు చెప్పడం లేదని... పైగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. గుజరాత్ లోని ధొలేరా నగరానికి కేంద్రం రూ. 98 వేల కోట్లను కేటాయించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని... అంత మొత్తంలో నిధులను ఎప్పుడు కేటాయించామో చెప్పాలని డిమాండ్ చేశారు.

 2009లోనే ధొలేరా నగరానికి అంకురార్పణ జరిగిందని, అప్పటి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని చెప్పారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ధొలేరాకు నిధులు వెల్లువెత్తుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ఎంతో చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. వైజాగ్-చెన్నై కారిడార్ ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం రెడీగా ఉందని, అయితే కృష్ణపట్నంను పూర్తి చేయడానికి చంద్రబాబు చొరవ చూపడం లేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News