nagachaitanya: 'సవ్యసాచి' కాంబినేషన్లో మరో మూవీ!

  • 'సవ్యసాచి'లో విలన్ గా మాధవన్ 
  • చైతూ నెక్స్ట్ మూవీ శివ నిర్వాణతో 
  • ఆ మూవీలోను మాధవన్ కి చోటు

చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో మాధవన్ నటిస్తున్నాడు. హీరో .. విలన్ ఇద్దరి మధ్య కూల్ గా గేమ్ జరుగుతూ వుంటుందట. ఆయన ఎత్తులను చైతూ చిత్తు చేయడమే కథలో ఆసక్తికరమైన అంశం.

ఈ సినిమా తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ చేయనున్నాడు. సమంత కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రకి కూడా మాధవన్ నే చైతూ సిఫార్స్ చేశాడట. మాధవన్ అయితేనే ఆ పాత్రకి సరిగ్గా సెట్ అవుతాడని చైతూ అనడంతో ఆయననే ఎంపిక చేసుకున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 'నిన్నుకోరి' తరువాత శివ నిర్వాణ చేస్తోన్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తివుంది.   

More Telugu News