ramaprabha: సావిత్రిలో మొండితనం ఉండేది .. అయినా జెమినీ గణేశన్ ఎంతగానో ప్రేమించాడు: రమాప్రభ

  • సావిత్రిని జెమినీ ఎంతగానో ప్రేమించాడు 
  • ఆమె పరిస్థితికి బాధపడుతూ వచ్చాడు 
  • జెమినీ మాటలు ఆమె వినిపించుకునేది కాదు        

తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు తీయిస్తూ .. నటిగా రమాప్రభ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను ముచ్చటించారు. 'మహానటి' సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె సావిత్రితో తనకి గల అనుబంధాన్ని గురించి మాట్లాడారు.

"సినిమాలో చూపించినట్టుగా సావిత్రికి తాగుడును అలవాటు చేసింది జెమినీ గణేశన్ కానేకాదు. సావిత్రిలో ఎంతో మొండితనం ఉండేది .. అయినా చివరివరకూ ఆమెను ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి జెమినీ గణేశన్. హాస్పిటల్లో సావిత్రి దగ్గరే కూర్చుని జెమినీ గణేశన్ ఎంతో బాధపడేవాడు .. దగ్గర నుంచి చూసినదాన్ని నేను. జెమినీ గణేశన్ మొదటి భార్య .. సావిత్రిని ఎంతో బాగా చూసుకునేది .. అంతే సఖ్యతగా ఆమెతో సావిత్రి ఉండేది. జెమినీ గణేశన్ పిల్లలంతా కూడా ఎంతో సఖ్యతగానే ఉండేవారు. సినిమాలు తీయడం వల్లనే సావిత్రి ఎక్కువగా నష్టపోయింది. వద్దని జెమినీ ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోలేదు. నేను ఆ సమయంలో సావిత్రి దగ్గరే ఉండటం వలన నాకు నిజాలు తెలుసు" అని రమాప్రభ చెప్పుకొచ్చారు.      

  • Loading...

More Telugu News