blade: ధర్మవరం రైల్వే స్టేషన్‌లో మహిళపై బ్లేడుతో ఉన్మాది దాడి!

  • ప్రయాణికులు వేచి ఉన్న గదిలో ఘటన
  • మహిళకు తీవ్ర రక్తస్రావం
  • ఆసుపత్రికి తరలింపు

అనంతపురం జిల్లాలోని ధర్మవరం రైల్వే స్టేషన్‌లో కలకలం చెలరేగింది. జేబులో బ్లేడుతో వచ్చిన ఓ ఉన్మాది ప్రయాణికులను భయాందోళనలకు గురిచేశాడు. ప్రయాణికులు వేచి ఉన్న గదిలోకి వెళ్లి ఓ మహిళపై బ్లేడుతో విచక్షణారహితంగా దాడికి దిగడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. ఈ విషయాన్ని తోటి ప్రయాణికులు రైల్వే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలిని పోలీసులు వెంటనే ధర్మవరం ఆసుపత్రికి తరలించారు. ఉన్మాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడి పేరు ముబారక్‌ అని గుర్తించి, దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News