ramaprabha: తమిళనాడు మాజీ సీఎం జయలలితకు .. నాకు మధ్య అలా దూరం పెరిగింది: రమాప్రభ

  • జయలలిత నన్ను మరిచిపోలేదు 
  • ఆమెతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది
  • మధ్యలో వాళ్ల ధోరణి నాకు కోపం తెప్పించింది

పాత తరం నటీనటులతోనే కాదు .. నేటి తరం నటీనటులతోను కలిసి రమాప్రభ చాలా సినిమాల్లో నటించారు. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి రమాప్రభ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను గురించి ప్రస్తావించారు.

 "జయలలితకు .. నాకు మధ్య ఎంతో సాన్నిహిత్యం వుండేది. నా కోసం ఆమె ఎన్నో మార్లు ఫోన్లు చేసింది .. అయినా నేను వెళ్లలేదు. సాధారణంగా కొంతమంది పైస్థాయికి వెళ్లాక, తమ పాత స్థాయి ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పి అప్పటి వాళ్ల బంధాలను తెంచేస్తూ వుంటారు. కానీ జయలలిత అలా కాదు .. ఆమె ఆ స్థాయికి చేరుకున్నప్పటికీ నా గురించి అందరినీ అడుగుతూ ఉండేది.

అయితే, మధ్యలో వుండే వాళ్లు వేసే ఎక్స్ ట్రా వేషాల వలన నాకు కోపం వచ్చేది. ఆమెకి ఫోన్ చేస్తే మధ్యలో వాళ్లు 'ఎవరు కావాలి .. ఏంటి?' అని అడిగేవాళ్లు. జయలలితతో ఎంతో సాన్నిహిత్యం వున్న నేను మధ్యలో వాళ్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? అలా నేను అలక చూపించడంతో మా మధ్య దూరం పెరిగింది" అంటూ ఆమె చెప్పుకొచ్చారు.  

  • Loading...

More Telugu News