sridevi: శ్రీదేవి పెయింటింగ్స్ తో ఎగ్జిబిష‌న్ ఏర్పాటుకు సన్నాహాలు!

  • శ్రీదేవికి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం 
  • తీరిక దొరికితే పెయింటింగ్స్ వేసేవారు
  • సన్నిహితులకు గిఫ్ట్ గా ఇచ్చేవారు   

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో కథానాయికగా అగ్రస్థానాన్ని అందుకున్న శ్రీదేవి, ఇటీవల హఠాత్తుగా చనిపోయారు. నటన పరంగా .. గ్లామర్ పరంగా ప్రేక్షకుల హృదయాలపై ఆమె వేసిన ముద్రను అంతతేలికగా ఎవరూ మరిచిపోలేరు. శ్రీదేవికి నటన అంటే ఎంత ఇష్టమో .. చిత్రలేఖనం అంటే కూడా అంతే ఇష్టమనే సంగతి చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. ఏ మాత్రం తీరిక దొరికినా ఆమె పెయింటింగ్స్ వేస్తూ ఉండేవారట.

అలా తాను గీసిన పెయింటింగ్స్ ను బంధువులకు .. సన్నిహితులకు గిఫ్ట్ గా ఇస్తూ వచ్చారు. వాళ్లంతా కూడా ఆ పెయింటింగ్స్ కి ఎంతో ప్రాధాన్యతనిస్తూ .. అపురూపంగా చూసుకుంటూ వస్తున్నారు. శ్రీదేని వేసిన పెయింటింగ్స్ లో ఇంట్లో వున్నవి .. సన్నిహితుల దగ్గరున్నవి సేకరించి, ఆమె జ్ఞాపకార్థంగా ముంబైలో ఒక ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడానికి బోనీకపూర్ సన్నాహాలు చేస్తున్నారట. గతంలో శ్రీదేవి తాను వేసిన ఓ పెయింటింగ్ ను లండన్ లోని ప్రతిష్ఠాత్మక క్రిస్టీలో వేలానికి ఉంచగా, ఒక వ్యక్తి 22 లక్షలు చెల్లించి దానిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.   

More Telugu News