akhilesh: ఎట్టకేలకు ప్రభుత్వ బంగళాను ఖాళీ చేసిన అఖిలేశ్ యాదవ్!

  • మరో రెండేళ్లు అదే బంగళాలో ఉంటామన్న అఖిలేశ్‌
  • కుదరదన్న సుప్రీంకోర్టు 
  • తండ్రితో కలిసి వేరే ఇంటికి వెళ్లిన యూపీ మాజీ సీఎం

ఇప్పటికీ ప్రభుత్వ బంగళాలోనే ఉంటోన్న ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఈరోజు ఆ నివాసాన్ని ఖాళీ చేశారు. పలు కారణాలు చూపుతూ మరో రెండేళ్లు తాము అదే బంగళాలో ఉంటామని, అందుకు అవకాశం ఇవ్వాలని  అఖిలేశ్ యాదవ్ సుప్రీంకోర్టుకు విన్నవించుకున్న విషయం తెలిసిందే.

అయితే, ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్థానం 15 రోజుల్లోగా ఆ బంగళాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించడంతో చేసేదేమీ లేక ఖాళీ చేశారు. మరోవైపు బహుజన్ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి కూడా నిన్న ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేసి, నూతన భవనానికి వెళ్లారు.                                                                                          

More Telugu News