BJP: ఓ పెద్ద అడుగు వేయాలంటే రెండు అడుగులు వెనక్కు వేయాలి: రాజ్‌నాథ్‌ సింగ్‌

  • యూపీలోని కైరానా లోక్ సభ స్థానంలో ఓటమి 
  • ఓటమిపై స్పందించిన హోమ్ మంత్రి
  • భవిష్యత్తులో తాము పెద్ద విజయం సాధిస్తామన్న రాజ్‌నాథ్‌

ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడైన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా, మహారాష్ట్రలోని భండారా-గోండియా, పాల్‌ఘర్‌, నాగాలాండ్‌ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ రెండింట్లో ఓడిపోయింది. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో బీజేపీ గెలవగా, నాగాలాండ్‌లో బీజేపీ మిత్రపక్షం ఎన్‌డీపీపీ విజయం సాధించింది.

రెండు స్థానాల్లో ఓటమిపై స్పందించిన కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ... ఓ పెద్ద అడుగు వేయాలంటే రెండు అడుగులు వెనక్కు వేయాలని, భవిష్యత్తులో తాము భారీ విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. కాగా, ఎన్డీఏ సర్కారుపై ఉన్న అసంతృప్తి బీజేపీ ఓటమితో బయటపడిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.      

  • Loading...

More Telugu News