nagachaitanya: 'శైలజా రెడ్డి అల్లుడు'లో ఒక పాట కోసం కోటి ఖర్చు!

  • మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
  • చైతూ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ 
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉంటాయట.

వాటిలో ఒకటైన సంగీత్ సందర్భంలో వచ్చే పాటను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలోని ప్రధాన తారాగణమంతా ఈ పాటలో కనిపించనున్నారు. ఈ పాట కోసం ప్రత్యేకమైన సెట్ వేసి అయిదు రోజుల పాటు చిత్రీకరించనున్నారు. ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఒక మీడియం బడ్జెట్ మూవీలో ఒక పాట కోసం కోటి రూపాయలు ఖర్చు చేస్తుండటం గురించి ఫిల్మ్ నగర్లో విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News