chidambaram: ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమానికి వెళ్లి.. వారి భావజాలంలోని తప్పులను చెప్పండి: ప్రణబ్‌కి చిదంబరం సూచన

  • ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానానికి ప్రణబ్‌ ఇప్పటికే ఒప్పుకున్నారు
  • ఎందుకు ఒప్పుకున్నారన్నది చర్చనీయాంశం కాదు
  • సర్‌, అక్కడికి వెళ్లండి!

నాగ్‌పూర్‌లోని రేషీమ్‌బాగ్ మైదానంలో వచ్చేనెల 7న జరగనున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్ శిక్షా వర్గ్ మూడవ వార్షిక కార్యక్రమం ముగింపు ఉత్సవంలో పాల్గొనడానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళుతోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లు కీలక నేతగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఒక్కసారిగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనబోతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వేదికపై ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగం కూడా చేయనున్నారు. ఈ విషయంపై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్ నేత పి.చిదంబరం 'వెళ్లనివ్వండంటూ' మీడియాతో అన్నారు.

'ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానానికి ప్రణబ్‌ ఇప్పటికే ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం కాదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే... సర్‌ అక్కడికి వెళ్లండి.. వారి భావజాలంలో ఏయే తప్పులున్నాయో చెప్పండి' అని చిదంబరం అన్నారు. 

More Telugu News