allu shirish: ఏబీసీడీ అంటూ రంగంలోకి అల్లు శిరీశ్ .. కొత్త సంగీత దర్శకుడికి ఛాన్స్

  • అల్లు శిరీశ్ హీరోగా 'ఏబీసీడీ'
  • దర్శకుడిగా సంజీవ్ కుమార్ 
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు

'ఒక్క క్షణం' సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, మంచి కథ కోసం వెయిట్ చేస్తూ అల్లు శిరీశ్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మలయాళంలో విజయాన్ని సాధించిన 'ఏబీసీడీ' సినిమాపై ఆయన దృష్టి పడింది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, అక్కడ ఘన విజయాన్ని అందుకుంది. ఒక్కసారిగా ఈ సినిమా అక్కడ దుల్కర్ స్థాయిని పెంచేసింది.

 అందువలన ఈ సినిమా తెలుగు రీమేక్ లో చేస్తే తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని అల్లు శిరీశ్ భావించాడు. మధుర శ్రీధర్ .. యాష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అల్లు శిరీశ్ ఈ సినిమా ద్వారా జుడా శాండీ అనే కన్నడ కంపోజర్ ను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది.  

More Telugu News