Telangana: తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జిగా గులాం నబీ ఆజాద్!

  • వచ్చే ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి
  • టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా ఆజాద్!  
  • త్వరలో వెలువడనున్న అధికారిక ప్రకటన

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కుంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను నియమించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏపీ వ్యవహారాల్లో ఆజాద్ క్రియాశీలకంగా వ్యవహరించారు.  

  • Loading...

More Telugu News