Anantapur District: కేరింతలు కొట్టిన ప్రాణం క్షణాల్లో గాల్లోకి... అనంతపురం ఎగ్జిబిషన్ లో విరిగిపడ్డ జెయింట్ వీల్!

  • ఎగ్జిబిషన్ లో ఘోర ప్రమాదం
  • బోల్టు ఊడి విరిగిపడ్డ ట్రాలీ కార్ 
  • బాలిక మృతి, మరో ఆరుగురికి గాయాలు

అనంతపురంలో జరుగుతున్న ఓ ఎగ్జిబిషన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన జెయింట్ వీల్ ను ఎక్కిన పిల్లలు, పెద్దలు ఆనందంగా కేరింతలు కొడుతున్న వేళ, ఆ జెయింట్ వీల్ విరిగిపడింది. గత రాత్రి జరిగిన ఈ ఘటనలో 10 ఏళ్ల వయసున్న బాలిక అమృత అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.

జెయింట్ వీల్ తిరుగుతున్న సమయంలో, ఓ ట్రాలీ కార్ బోల్టు ఊడిపోయి, అది కిందపడుతూ మరో రెండు ట్రాలీ కార్ లపై పడిందని తెలుస్తోంది. గాయపడిన వారిని అనంతపురం జనరల్ హాస్పిటల్ కు తరలించారు. అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్ ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్ కు ఆదివారం కలసిరావడంతో అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చారు. సదరు ట్రాలీ కార్ బోల్టు లూజుగా ఉన్నదని తాము చెప్పినా, జెయింట్ వీల్ ఆపరేటర్ పట్టించుకోలేదని ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో ఆపరేటర్ మద్యం మత్తులో ఉన్నాడని ఆరోపించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News