Maharashtra: ఉద్ధవ్ ఠాక్రే కంటే నాకే ఎక్కువ సభ్యతాసంస్కారాలు ఉన్నాయి: యూపీ సీఎం యోగి

  • చెప్పులు విప్పకుండానే శివాజీ విగ్రహానికి పూలదండేసిన యోగి
  • అదే చెప్పుతో యోగి చెంపపై కొట్టాలన్న శివసేన అధినేత ఉద్ధవ్
  • ఉద్ధవ్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్న యోగి
మహారాష్ట్రంలోని పాల్ఘర్ లో ఎన్నికల ప్రచారం నిమిత్తం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇటీవల పర్యటించారు. ఈ ప్రచారంలో భాగంగా మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలదండ వేశారు. అయితే, యోగి తాను ధరించిన చెప్పులు విడవకుండానే ఆ విగ్రహానికి పూల దండ వేయడాన్ని శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

యోగి చేసిన పనికి అదే చెప్పుతో ఆయన చెంప పగలగొట్టాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అంతే ఘాటుగా యోగి స్పందించారు. ఉద్ధవ్ ఠాక్రేకు వాస్తవం ఏంటో తెలియదని, ఆయన నుంచి సభ్యతాసంస్కారాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని బదులిచ్చారు. మహనీయులకు, గొప్ప వ్యక్తులకు ఎలా నివాళులర్పించాలో తనకు తెలుసని, ఉద్ధవ్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
Maharashtra
Uttar Pradesh
uddav
cm yogi

More Telugu News